News October 12, 2025

రుషికొండ ప్యాలెస్ ఎలా వినియోగిద్దాం.. సలహాలు కోరిన ప్రభుత్వం

image

AP: విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పర్యాటక శాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ భవనాలను ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో తెలపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. rushikonda@aptdc.inకు OCT 17 లోపు మెయిల్ చేయాలని టూరిజం అథారిటీ CEO ఆమ్రపాలి ప్రకటనలో తెలిపారు. పౌరులు, సంస్థల సూచనలను మంత్రుల బృందం సమీక్షించి, నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

Similar News

News October 12, 2025

తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి

image

AP: రాష్ట్రంలో పలు చోట్ల విషాద ఘటనలు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా చీరాల(M) వాడరేవు సముద్ర తీరంలో స్నానం చేస్తూ అలల తాకిడికి ఐదుగురు గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. అటు కడప(D) కమలాపురంలో ఈతకు వెళ్లి ఈర్ల సుకన్య(11) అనే బాలిక చనిపోగా, అన్నమయ్య(D) మదనపల్లెలో సాయికృష్ణ(15) అనే విద్యార్థి హంద్రీనీవా కాలువలో గల్లంతయ్యాడు.

News October 12, 2025

92 ఏళ్లు.. మరోసారి ఎన్నికల్లో పోటీ

image

ఆఫ్రికా దేశం కామెరూన్ అధ్యక్షుడు పాల్ బియా 92 ఏళ్ల వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ కాగా కామెరూన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూమెంట్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. గెలిస్తే ఏడేళ్ల పాటు అధికారంలో కొనసాగనున్నారు. 2.90కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఇప్పటి వరకు ఇద్దరే అధ్యక్షులుగా ఉన్నారు. 1960 నుంచి 82 వరకు అహ్మద్ అహిద్జో, ఆ తర్వాత బియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

News October 12, 2025

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌.. ఏ పార్టీకి ఎన్నంటే?

image

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU 101, LJP (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.