News October 12, 2025

గుంతకల్లులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

గుంతకల్లు మండలం కసాపురం రోడ్డులో బైక్ అదుపు తప్పి కింద పడింది. ప్రమాదంలో శివకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నప్పటికీ ఆదివారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల గ్రామానికి చెందిన శివకుమార్ పనిమీద గుంతకల్లుకు వచ్చాడు. తిరిగి నంచర్లకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కిందపడి మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 12, 2025

డాక్టర్ కావాలని ఆశను కూటమి ప్రభుత్వం చిదిమేస్తోంది: రంగయ్య

image

డాక్టర్ కావాలనే పేద, సామాన్య, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను కూటమి ప్రభుత్వం చిదిమేస్తోందని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దొడగట్టలో ఆదివారం వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. తలారి రంగయ్య సంతకం చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుట్రను ప్రజలకు తెలియజేయాలని కోటి సంతకాల కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు.

News October 12, 2025

ఈనెల 13న కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 11, 2025

అనంత: గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

image

అనంతపురంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్ గుండెపోటుకు గురై మృతి చెందారు. తెల్లవారుజామున శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.