News October 12, 2025
‘పార్టీని బలోపేతం చేసే దిశగా DCC అధ్యక్షుల నియామకం’

కాంగ్రెస్ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. అందరి అభిప్రాయాలు, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని, జిల్లా అధ్యక్షుడి ఎంపిక త్వరలో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 12, 2025
తిరుపతి : ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రాజెక్టులో భాగంగా కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పేర్కొంది. మొత్తం 10 విభాగాలలో 56 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22.
News October 12, 2025
APలో బీచ్కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

బాపట్లలోని చీరాల బీచ్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి బీచ్కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
News October 12, 2025
APలో బీచ్కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

బాపట్లలోని చీరాల బీచ్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి బీచ్కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.