News October 12, 2025
ఊట్కూర్: చిన్నారులపై వీధి కుక్కల దాడి

ఊట్కూరు శ్రీనివాస కాలనీలో ఆదివారం వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న విశ్వ అధ్విత్, రవి, రాకేష్ తో పాటు పలువురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచినట్లు వారి తల్లిదండ్రులు వాపోయారు. గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తూ.. మనుషులు, పశువుల పై దాడులకు పాల్పడుతున్న సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 12, 2025
గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తివేస్తాం: జన్ సురాజ్

త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే లిక్కర్ బ్యాన్ వెంటనే ఎత్తివేస్తామని జన్ సురాజ్ పార్టీ ప్రకటించింది. దీంతో రూ.28వేల కోట్ల రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రపంచ బ్యాంకు, IMF నుంచి రూ.5-6లక్షల కోట్ల రుణాల సమీకరణకు ఉపయోగిస్తామని వెల్లడించారు. బిహార్లో 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది.
News October 12, 2025
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*గద్వాల: ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి.
*రైతు ఆదాయం పెంచేందుకు కేంద్రం కొత్త పథకం.
*హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.
*అయిజ: స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి.
*ధన్ ధాన్య యోజన రైతులకు వరం.
*అలంపూర్: అభివృద్ధికి 15 కోట్లు.
*ఎర్రవల్లి: ఆటో నుంచి జారిపడి వ్యక్తి మృతి.
*ధరూర్: జూరాలకు తగ్గిన వరద.
*రాజోలి: సుంకేసులకు తగ్గిన వరద.
*మల్దకల్: ఆర్ఎస్ఎస్ పద సంచలన ర్యాలీ.
News October 12, 2025
కాకినాడ: వాగులోకి దిగి ఇద్దరు గల్లంతు

రంపచోడవరం మండలం కొత్త పాకల గ్రామ శివారు చాపరాయి వద్ద ఆదివారం సాయంత్రం స్నానం చేసేందుకు వాగులోకి దిగి పర్యాటకులు గల్లంతయిన ఘటన చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన ఆరుగురు మిత్రులు విహారయాత్రకు రంపచోడవరానికి వచ్చారు. కొత్తపాకల శివారులో స్నానం చేసేందుకు అందరూ వాగులోకి దిగగా.. కాకినాడ జగన్నాథపురానికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్, కరపకు చెందిన ఓలేటి మణికంఠ వాగులో గల్లంతయ్యారు. పోలీసులు గాలిస్తున్నారు.