News October 12, 2025

కరీంనగర్: యథావిధిగా ప్రజావాణి

image

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రజావాణి కార్యక్రమం యాథావిధిగా కొనసాగుతుందన్నారు.

Similar News

News October 12, 2025

కరీంనగర్: ‘శబరిమలలో బంగారం చోరీపై చర్యలు తీసుకోవాలి’

image

శబరిమలలో బంగారం చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కరీంనగర్ జిల్లా అయ్యప్ప సేవా సమితి వినతిపత్రం అందజేశారు. శబరిమల ధర్మశాస్త్ర దేవస్థానంలో బంగారం చోరీ ఆస్తుల దుర్వినియోగం విషయంలో TDB బోర్డు నిబంధనల ఉల్లంఘనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ పర్యవేక్షణలో ఆలయ ఆస్తులపై ఆడిట్ చేయాలని కోరారు.

News October 12, 2025

IMA కరీంనగర్ అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజ

image

2025–26 సంవత్సరానికి భారత వైద్యుల సంఘం(IMA) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజను ఎన్నుకున్నట్లు IMA ప్రకటించింది. ఎన్నికైన డా.ఆకుల శైలజను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో, వైద్య సేవల అభివృద్ధిలో ఆమె చేస్తున్న కృషిని ప్రసంశించారు.

News October 11, 2025

కరీంనగర్: DCC రేసులో ఎవరెవరున్నారు?

image

KNR <<17974062>>DCC అధ్యక్షుడి రేసులో<<>> సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, రాజేందర్ రావు, పద్మాకర్ రెడ్డి, శ్రీరామ చక్రవర్తి, వైద్యుల అంజన్ కుమార్‌తో పాటు పలువురు పోటీపడుతున్నారు. సిరిసిల్ల నుంచి సంగీతం శ్రీనివాస్ రావు, చక్రధర్ రెడ్డి, గడ్డం నర్సయ్య ఆశిస్తున్నారు. జగిత్యాల నుంచి సుజిత్ రావు, జువ్వాడి కృష్ణారావు, కరంచంద్ ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి నుంచి తిరుపతియాదవ్, సదానందం, శశిభూషణ్, సారయ్యగౌడ్ రేసులో ఉన్నారు.