News October 12, 2025
తురకపాలెం బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన పెమ్మసాని

గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితోనే మరణాలు సంభవించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలియకుండానే వ్యాధి వ్యాప్తి జరిగిందని చెప్పారు. మరణించిన 28 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ ప్రాంతంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు వైద్య నిపుణులను తీసుకొచ్చామన్నారు.
Similar News
News October 12, 2025
కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏం చేయగలను: కిషన్ రెడ్డి

TG: 42% బీసీ రిజర్వేషన్లను HC తిరస్కరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రిగా తాను ఉన్నంత మాత్రాన ఏం చేయగలనని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కాదంటే రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని అన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీంతో BC రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
News October 12, 2025
గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తివేస్తాం: జన్ సురాజ్

త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే లిక్కర్ బ్యాన్ వెంటనే ఎత్తివేస్తామని జన్ సురాజ్ పార్టీ ప్రకటించింది. దీంతో రూ.28వేల కోట్ల రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రపంచ బ్యాంకు, IMF నుంచి రూ.5-6లక్షల కోట్ల రుణాల సమీకరణకు ఉపయోగిస్తామని వెల్లడించారు. బిహార్లో 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది.
News October 12, 2025
ఉమెన్స్ WC: భారత్ గెలుస్తుందా?

ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా విజయానికి 78 బంతుల్లో 86 రన్స్ కావాలి. ప్రస్తుతం క్రీజులో హీలీ (131), గార్డ్నర్ (31) ఉన్నారు. భారత్ గెలవాలంటే 7 వికెట్లు పడగొట్టాలి లేదా పరుగుల్ని కట్టడి చేయాలి. ప్రస్తుతం విన్ ప్రెడిక్షన్ ప్రకారం ఆస్ట్రేలియాకు 59%, ఇండియాకి 41% విజయావకాశాలున్నాయి. మరి ఈ మ్యాచులో మన టీమ్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.