News October 12, 2025
ప్రజల సౌకర్యార్థం రేపు డివిజన్లలో ప్రజావాణి: కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి జిల్లా ప్రజల సౌకర్యార్థం సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కాకుండా డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News October 12, 2025
మంత్రి లోకేశ్ సమీక్షలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 12, 2025
విజయనగరం జిల్లాలో నేటి ప్రధాన వార్తలు

➤శ్రీ పైడిమాంబ తెప్పోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు, రేపు ట్రయిల్ రన్
➤కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న చిన్న శ్రీను
➤విజయనగరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశం
➤మంత్రి లోకేశ్తో కిమిడి నాగార్జున భేటీ
➤క్షత్రీయుల సంక్షేమానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు
➤టీడీపీ నూతన కమిటీలను ప్రకటించిన ఎమ్మెల్యే అదితి
➤కొత్తవలసలో జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి
News October 12, 2025
బాచుపల్లి రోడ్డులో వాహనదారుల కష్టాలు! పట్టించుకునే వారే లేరా?

నిజాంపేట, బాచుపల్లి, మల్లంపేట రహదారిలో వాహనదారులు, పాదచారులకు కష్టాలు తప్పడం లేదు. రోడ్డు బాగాలేకపోవడం, బాచుపల్లిలో ఫైఓవర్, రహదారి నిర్మాణం పూర్తికాకపోవడం, అనేకచోట్ల కంకర తేలడం, మరోవైపు డస్ట్ న్యూసెన్స్ విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట-మల్లంపేట వరకు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని తెలిపారు.