News October 12, 2025
పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్గా దొరబాబు..?

పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పదవిలో మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఇన్ఛార్జ్గా నియమించనున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్పై క్యాడర్ అసంతృప్తిగా ఉండటంతో, అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దొరబాబు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 13, 2025
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ బైపోల్ అనివార్యమైన విషయం తెలిసిందే.
News October 12, 2025
మంత్రి లోకేశ్ సమీక్షలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 12, 2025
విజయనగరం జిల్లాలో నేటి ప్రధాన వార్తలు

➤శ్రీ పైడిమాంబ తెప్పోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు, రేపు ట్రయిల్ రన్
➤కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న చిన్న శ్రీను
➤విజయనగరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశం
➤మంత్రి లోకేశ్తో కిమిడి నాగార్జున భేటీ
➤క్షత్రీయుల సంక్షేమానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు
➤టీడీపీ నూతన కమిటీలను ప్రకటించిన ఎమ్మెల్యే అదితి
➤కొత్తవలసలో జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి