News October 12, 2025

సెమీఫైనల్ చేరుకున్న చిత్తూరు జిల్లా టీం

image

రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో సెమీఫైనల్‌కు చిత్తూరు జిల్లా టీం చేరుకుంది. కడప YSR స్టేడియంలో ఈ పోటీలు జరిగాయి. సెమీ ఫైనల్‌లో అర్హత కోసం తిరుపతి, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. ఆరు వికెట్ల తేడాతో చిత్తూరు జిల్లా జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు గోపీనాథ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ నెల 19న అనంతపురంలో జోన్ ఫోర్ సెమీఫైనల్స్ జరుగునున్నాయి.

Similar News

News October 13, 2025

CRDA ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధం: నారాయణ

image

AP: అమరావతిలో CRDA ప్రధాన ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధమైనట్లు మంత్రి నారాయణ తెలిపారు. రేపు 9.54AMకు CM CBN కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తదుపరి ఆయనకు ఢిల్లీ పర్యటన ఉండటంతో బహిరంగ సమావేశం ఉండదన్నారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులే అని వెల్లడించారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో CRDA ఆఫీస్ నిర్మించిన విషయం తెలిసిందే.

News October 13, 2025

రేపు ఉదయం లోగా పలు జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలో రేపు ఉదయం 8.30గంటల లోపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 13, 2025

హామీలకు హద్దులుండవా?

image

బిహార్‌లో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలకు హద్దులు ఉండవా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తామని <<17988426>>JSP<<>> తాజాగా ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో కుదరని, సదుద్దేశంతో అమలు చేస్తున్న బ్యాన్‌ను ఎత్తేస్తామనడం కరెక్టేనా అని SMలో చర్చ జరుగుతోంది. అటు తాము గెలిస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ హామీలపై మీ COMMENT.