News October 12, 2025

జనగామ: ప్రజావాణి నిర్వహణపై స్పష్టత కరవు!

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు వాయిదా వేయడంతో ఎన్నికల సంఘం కోడ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు ఉన్నట్లా? లేనట్లా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 13, 2025

పాక్-అఫ్గాన్ మధ్య ఇరాన్ మధ్యవర్తిత్వం

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ముస్లిం దేశాలు ముందుకొచ్చాయి. ఇరు దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ దేశాలు తెలిపాయి. ఇరాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కాల్పులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబుల్‌లో పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలోనే ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.

News October 13, 2025

VKB: ఇసుక మాఫియాకు రాజకీయ నాయకుల అండా.?

image

VKB జిల్లాలోని ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఈ దందాకు అంతా బడా నాయకుల అండ దండలతోనే సాగుతుందని విశ్వసనీయ సమాచారం. దీనిని అరికట్టేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రయత్నించిన వారిపైకి వాహనాలు ఎక్కిచ్చేస్తున్నారు. తాజాగా తాండూర్ ఓ సంఘటన చోటుచేసుకుంది. వాహనాలు ఆపిన మరుక్షణమే ఓ బడా నాయకుడితో ఫోన్ వచ్చేస్తుంది. వెంటనే విడిచిపెట్టకుంటే బెదిరింపులు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

News October 13, 2025

నంద్యాలలో నేడు ఎస్పీ PGRS రద్దు

image

నంద్యాల జిల్లాలోని SP కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు SP సునీల్ షెరాన్‌ తెలిపారు. అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని అన్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. అక్టోబర్ 20వ తేదీన తిరిగి PGRSను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన అన్నారు.