News October 13, 2025

పాక్-అఫ్గాన్ మధ్య ఇరాన్ మధ్యవర్తిత్వం

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ముస్లిం దేశాలు ముందుకొచ్చాయి. ఇరు దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ దేశాలు తెలిపాయి. ఇరాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కాల్పులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబుల్‌లో పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలోనే ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.

Similar News

News October 13, 2025

సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్‌ సేవలు!

image

TG: హెలీ టూరిజానికి రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్‌లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ తీసుకురానుంది.

News October 13, 2025

చైనా- పీఆర్23 వరి వంగడం ప్రత్యేకతలు ఇవే

image

చైనా PR-23 వరిని ఒక్కసారే నాటి మూడేళ్లలో 6 పంటలను కోసే అవకాశం ఉండటంతో సాగు ఖర్చు 29% తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. పంట 119 రోజుల్లోనే కోతకు వస్తుంది. తొలి కోతలో హెక్టారుకు 6.8-7.5 టన్నులు, తర్వాత కోతల్లో 5.4-6.3 టన్నుల దిగుబడి వస్తోంది. భారత్‌లో సగటు వరి దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులే. ఆసియా, ఆఫ్రికాలోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో కూడా PR-23 వంగడం మెరుగైన దిగుబడినిస్తోంది.

News October 13, 2025

కర్రెగుట్టల్లో CRPF ట్రైనింగ్ స్కూల్!

image

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కమాండో ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని CRPF ప్లాన్ చేస్తోంది. ఇందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించేందుకు సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ తర్వాత అక్కడ IEDs, బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఎక్సర్‌సైజ్ చేపట్టాం. ఆ పని పూర్తికావచ్చింది. శాశ్వత స్థావరం ఏర్పాటు కోసం లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రా అంశాలను పరిశీలిస్తున్నాం’ అని చెప్పాయి.