News October 13, 2025

కడప: కుటుంబం ఆత్మహత్య

image

కడప జిల్లాలో ఆదివారం రాత్రి విషాదం నెలకొంది. రాయచోటి రహదారి ఫ్లైఓవర్ సమీపంలో కడప నగరంలోని శంకరాపురానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎర్రగుంట రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మరో కొద్ది దూరంలో కడప నబీ కోటకు చెందిన శివ అనే వ్యక్తి మృతదేహం కూడా కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు.

Similar News

News October 13, 2025

త్వరలో అమరావతి రైతులను కలుస్తా: CBN

image

AP: అమరావతి రైతులను <<17990155>>త్వరలో<<>> కచ్చితంగా కలుస్తానని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటానని CM చంద్రబాబు అన్నారు. ఇవాళ చాలా ఆనందంగా ఉందని CRDA ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ అమరావతిలోనే జరిగిందన్నారు. HYDను మించిన రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు.

News October 13, 2025

ఏలేశ్వరం: గోతుల దారిలో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్

image

ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి రాజవొమ్మంగి మండలంలోని చెరుకుంపాలెం వరకు రోడ్డు అద్వాన్నంగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతున్న ఆర్టీసీ బస్సు టైర్ బోర్నగూడెం వద్ద ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు దారుణంగా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News October 13, 2025

నల్గొండ జిల్లాలో 32.9 MM వర్షపాతం నమోదు

image

నల్గొండ జిల్లాలో ఆదివారం 32.9 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా NKPలో 78.9 మిల్లీమీటర్లు, చిట్యాలలో 30.0, కట్టంగూరులో 19.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నకిరేకల్‌లో 13.7, కేతేపల్లిలో 17.6, తిప్పర్తిలో 23.2, నల్గొండలో 12.7, కనగల్‌లో 55.8, అనుములలో 76.2, నిడమనూరులో 41.2, త్రిపురారంలో 31.8, మాడుగులపల్లిలో 59.2, వేములపల్లిలో 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.