News October 13, 2025
ADB: రేషన్ కమీషన్.. డీలర్ల పరేషాన్

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుకాణాల అద్దెలు సైతం కట్టలేకపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డీలర్లకు క్వింటాకు రూ.140 చెల్లిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 1468 రేషన్ షాపులున్నాయి. వీటిని నడుపుతున్న డీలర్లు కమీషన్ చెల్లించాలని కోరుతున్నారు.
Similar News
News October 13, 2025
ప్రారంభాలు తప్ప విక్రయాలు లేవా..?

తిరుచానూరు మామిడి కాయలు మండి వద్ద మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మూడోసారి ప్రారంభమైన రైతుబజారు సైతం మూతపడింది. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు, గత బుధవారం మూడోసారి ఈ మార్కెట్ను అధికారులు ప్రారంభించారు. అయితే రైతులు ఎవరూ రాకపోవడంతో మూతవేసి ఉంది. మార్కెట్లో సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
News October 13, 2025
MTM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కలెక్టర్ డీ.కే. బాలాజీ నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం” కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డీఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ప్రజల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 13, 2025
జూబ్లీహిల్స్లో BRSకు TRSతో ముప్పేనా?

గతంలో పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు BRSను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్(TRS- D) రూపంలో ముప్పు పొంచి ఉంది. పేరు, జెండా ఒకేలా ఉండటం, ఉద్యమ పార్టీ BRSగా మారినా చాలామందికి TRSగానే గుర్తు. దీంతో TRS(D) డ్యామేజ్పై గులాబీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అటు కాంగ్రెస్కు బలమైన పోటీ కావడంతో ప్రత్యర్థులు ఈ కుట్ర చేశారని గులాబీదళం ఆరోపిస్తోంది.