News October 13, 2025

సర్వత్రా పరమాత్మను చూడటమే నిజమైన భక్తి

image

నిజమైన భక్తి అంటే ఆరాధన చేయడమే కాదు. సర్వం పరమాత్మే అని నమ్మాలి. ‘ఎవడు సమస్తమును నాయందు, నాయందు సమస్తమును చూచుచున్నాడో’ అనే గీతా వాక్యం దీన్ని బోధిస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు, జీవిలో ఆ దివ్యత్వాన్ని చూడగలగాలి. సమస్తాన్ని భగవంతుడికి సమర్పించిన భక్తుడిని పరమాత్మ ఎప్పటికీ విడవదు. ఇలాంటి అనన్య భక్తి కలిగి ఉండేవారే నిజమైన భక్తులు. ఈ జ్ఞాన దృష్టిని పెంపొందించుకోవడమే మన జీవిత పరమార్థం. <<-se>>#Daivam<<>>

Similar News

News October 13, 2025

తాజా రౌండప్

image

* కోల్డ్రిఫ్ సిరప్ తయారీ సంస్థ శ్రీసన్ ఫార్మా అనుమతులు రద్దు చేస్తున్నట్లు తమిళనాడు డ్రగ్ నియంత్రణ విభాగం ప్రకటన
* ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్
* ఏడు రోజులైనా ఇంకా పూర్తికాని ఐపీఎస్ పూరన్ కుమార్ అంత్యక్రియలు.. పోస్టుమార్టానికి నిరాకరిస్తున్న భార్య అమనీత్
* ఇజ్రాయెల్‌కు ట్రంప్.. రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికిన ప్రధాని నెతన్యాహు

News October 13, 2025

అఫ్గాన్-పాక్ మధ్య సరిహద్దు వివాదమేంటి?

image

పాక్-అఫ్గాన్ మధ్య సరిహద్దుల్లో ‘డ్యూరాండ్ లైన్’ వెంబడి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1893లో గీసిన ఈ లైన్‌పై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. Durand Lineను అఫ్గాన్ ఒప్పుకోలేదు. PAK మాత్రం ఆ లైన్‌ను ‘అంతర్జాతీయ సరిహద్దు’ అంటోంది. ఈక్రమంలో తాలిబన్ పాలనలో వివాదం మళ్లీ మొదలైంది. తాలిబన్ ఫైటర్లు పాక్ పెట్టిన కంచెను తొలగించడంతో గొడవ ముదిరింది. దీంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.

News October 13, 2025

నగలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

పండుగలు వస్తే చాలు మహిళలు భద్రంగా దాచుకున్న నగలను ఒక్కోటి బయటకు తీస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నగలు నల్లగా మారి, మెరుపు తగ్గుతాయి. దీనికోసం కొన్ని టిప్స్ పాటించండి. * వేడినీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ వేసి నగలను నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో తోమితే మెరుపు తిరిగొస్తుంది. * బంగారుగాజులను నీటిలో నానబెట్టాలి. శనగపిండిలో వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.