News October 13, 2025

ఐదేళ్లలో 30శాతానికి మహిళా ఉద్యోగులు: SBI

image

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ SBI 2030కల్లా మహిళా ఉద్యోగుల వాటాను 30శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 2.40 లక్షల సిబ్బందిలో వీరి వాటా 27%గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు.

Similar News

News October 13, 2025

ఇద్దరు సెంచరీ వీరులు ఔట్

image

ఢిల్లీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ హీరోలు ఓపెనర్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలిన కరేబియన్ జట్టు ఫాలో ఆన్‌లో పోరాడుతోంది. ప్రస్తుతం విండీస్ స్కోర్ 289/4 కాగా 19 రన్స్ ఆధిక్యంలో ఉన్నారు.

News October 13, 2025

లాలూపై అభియోగాలు.. ఎన్నికల వేళ ఆర్జేడీకి షాక్

image

బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఆర్జేడీకి ఎదురుదెబ్బ తగిలింది. IRCTC స్కామ్ కేసులో ఆ పార్టీ అగ్రనేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది. అవినీతి, నేరపూరిత కుట్ర, చీటింగ్ ఛార్జెస్ నమోదు చేసింది. వారు విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు. కాగా కేసు విచారణకు స్వయంగా లాలూ వీల్‌ఛైర్‌లో హాజరయ్యారు.

News October 13, 2025

‘కపాస్ కిసాన్ యాప్’.. వాడకం ఎలా?

image

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.