News October 13, 2025
200% టారిఫ్స్ వేస్తానని బెదిరించా: ట్రంప్

ఇండియా-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ‘టారిఫ్స్ ఆధారంగానే నేను కొన్ని యుద్ధాలను ఆపాను. ఇండియా-పాక్ వార్ విషయంలోనూ అదే చేశాను. 100%, 150%, 200% విధిస్తానని హెచ్చరించా’ అని తెలిపారు. 24 గంటల్లోనే ముగించానని చెప్పారు. సుంకాలతో భయపెట్టకపోతే ఘర్షణలు ఆగేవి కాదన్నారు. పీస్ సమ్మిట్ కోసం ఈజిప్టుకు బయల్దేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు.
Similar News
News October 13, 2025
WBలో తాలిబన్ పాలన నడుస్తోంది: BJP, CPM

వైద్య విద్యార్థిని రేప్ ఘటనపై WB CM మమత వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అర్ధరాత్రి ఆమె బయటకు ఎలా వచ్చిందనడంపై నేతలు మండిపడుతున్నారు. ‘ఇక్కడ తాలిబన్ పాలన నడుస్తోంది. మహిళలు రాత్రివేళ బయటకు రావద్దా? వస్తే రేప్ చేస్తామంటారా?’ అని BJP MLA అగ్నిమిత్ర ప్రశ్నించారు. ‘స్త్రీలు పురుషులతో సమానం కాదా? వారి భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా?’ అని CPM నిలదీసింది. కాగా తన కామెంట్లను మీడియా వక్రీకరించిందని మమత అన్నారు.
News October 13, 2025
వెండిపై పెట్టుబడి: ట్రేడర్కు రూ.600 కోట్ల నష్టం!

కమోడిటీ ట్రేడింగులో అనుభవలేమి నిలువునా ముంచుతుందనేందుకు మరో ఉదాహరణ. కొండెక్కిన వెండిని ఒకరు భారీగా షార్ట్ చేశారని స్టాక్ మార్కెట్ కోచ్ ఏకే మాన్ధన్ ట్వీట్ చేశారు. అయితే రేటు ఇంకా ఎగిసి ATHకు చేరడంతో బ్రోకర్ ఆ పొజిషన్లను క్లోజ్ చేశారన్నారు. దాంతో ఆ ట్రేడర్ ఏకంగా రూ.600Cr నష్టపోయాడని తెలిపారు. అతడెవరో ఆయన వెల్లడించలేదు. మొదట ఎక్కువ ధరకు అమ్మి తర్వాత తక్కువ ధరకు కొని లాభపడటాన్ని షార్టింగ్ అంటారు.
News October 13, 2025
మరికాసేపట్లో వర్షం

తెలంగాణలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని IMD తెలిపింది. కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో ఇవాళ కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.