News October 13, 2025
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి.. ఆదాయం జోరు

పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి, డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్పార్క్లోని దుప్పులను వీక్షించారు. 496 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్ లైఫ్ శాఖకు ₹27,390 ఆదాయం లభించింది. 480 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్కు కూడా భారీగా ఆదాయం వచ్చింది.
Similar News
News October 13, 2025
JMKT: భారీగా తరలివచ్చిన పత్తి.. తగ్గిన ధర..!

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్కు పత్తి భారీగా తరలివచ్చింది. రైతులు 174 వాహనాల్లో 1408 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,400 ధర పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 43 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,200 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.400 తగ్గింది.
News October 13, 2025
MBNR:Police Flag Day.. అప్లై చేసుకోండి ఇలా!

ప్రతి ఏడాది ఈనెల 21న నిర్వహించే “పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ డి.జానకి తెలిపారు.
✒6వ తరగతి-PG విద్యార్థులు
✒అంశం:1.డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, 2.విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు
✒పేరు నమోదుకు లింక్:https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
✒వ్యాసాన్ని పేపర్పై రాసి.. ఫోటో/ PDFలో (500 పదాలు మించకూడదు) అప్లోడ్ చేయాలి
✒చివరి తేదీ:OCT 28
News October 13, 2025
సంగారెడ్డి: ముగిసిన ఓపెన్ స్కూల్ మూల్యాంకనం

జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9 నుంచి నిర్వహించిన ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ తరగతుల మూల్యాంకనం నేటితో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను హైదరాబాద్లోని ఓపెన్ స్కూల్కు పంపించామన్నారు. త్వరలోనే వాటి ఫలితాలు వెలువరిస్తామన్నారు.