News April 8, 2024

మోదీ గెలవాలని వేలు కట్ చేసుకున్నాడు

image

ప్రధాని మోదీ మూడోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ అరుణ్ అనే వ్యక్తి తన చూపుడు వేలును కాళీమాతకు బలిదానం ఇచ్చాడు. ఆ తర్వాత రక్తంతో ఆలయ గోడలపై.. ‘మోదీ అందరికన్నా గొప్పవారు. నువ్వు ఆయనను గెలిపించాలి కాళీమాత’ అని రాశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అతను తన ఇంట్లోనే మోదీకి గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్నాడు. కాగా నాయకులపై అభిమానంతో శరీరాలను గాయపరచుకునే పిచ్చి పనులు చేయొద్దని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News April 6, 2026

గ్యాస్ కొరతపై రాహుల్ ఫైర్

image

వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కష్టకాలాన్ని మోదీ ప్రభుత్వం ఎలాగైతే గాలికొదిలేసిందో ఇప్పుడు గ్యాస్ సంక్షోభాన్నీ అలాగే హ్యాండిల్ చేస్తోందన్నారు. ప్రకటనలకే పరిమితమవుతూ పేదలను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. రోజూ ₹500-800 సంపాదించే కూలీలకు గ్యాస్ అందనంత దూరమైందన్నారు. దీనివల్ల కార్మికులు నగరాలను వదిలి గ్రామాలకు వెళ్తున్నారని, పరిశ్రమలు నష్టపోతున్నాయన్నారు.

News April 6, 2026

ప్చ్.. ఇంకా IPL ఆడాల్సింది: అశ్విన్

image

IPLలో వరుసగా 3 మ్యాచుల్లో CSK ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ ప్లేయర్ అశ్విన్ నిరాశ వ్యక్తం చేశారు. గత సీజన్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది కాదని వాపోయారు. జట్టుపై నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని, లేదంటే ఈ సీజన్ కూడా ఆడేవాడినని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది కలగొద్దని, తన వల్ల ఫ్రాంచైజీకి ₹10 కోట్లు మిగులుతాయనే భావించానన్నారు. మానసిక అలసట వల్లే గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని వివరించారు.

News April 6, 2026

భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయా.. అదెలా సర్?

image

ఉజ్జయినిలో భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2 వేర్వేరు అక్షాంశాల్లో ఉండే లైన్స్ ఎలా కలుస్తాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘భూమధ్య రేఖ(Equator), కర్కాటక రేఖ(Tropic of Cancer).. సమాంతర రేఖలు. అవి కలవవు. మీరు BJPకి ఓటు వేస్తే విద్యావ్యవస్థను తీర్చిదిద్దేది ఇలాంటి వ్యక్తులే’ అని TMC నేత సాకేత్ గోఖలే ఎద్దేవా చేశారు.