News October 13, 2025

కరీంనగర్: ప్రకృతి సంపదను ‘తోడేస్తున్నారు’..!

image

ఉమ్మడి KNRలో గోదావరి, మానేరు నదులను ఇసుక మాఫియా తోడేస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతుందన్న టాక్ నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రీచుల్లో రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకను తోడేసి తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మైనింగ్ శాఖ, TGMDC చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలొస్తున్నాయి. KNR, RGM CPలు ఇసుకాసురలకు చెక్ పెట్టి ప్రకృతి సంపదను కాపాడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Similar News

News October 13, 2025

కాంతార చాప్టర్-1: రిషబ్ కష్టం చూశారా?

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తన కాళ్లు వాచిపోయాయని, శరీరం అలసిపోయిందంటూ ఫొటోలను రిషబ్ Xలో షేర్ చేశారు. ఈ కష్టం వల్లే క్లైమాక్స్ అభిమానులు ఆరాధించే స్థాయికి వెళ్లిందన్నారు. తాను నమ్మిన దైవశక్తి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైందని తెలిపారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

News October 13, 2025

ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

image

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News October 13, 2025

గ్రీన్ ఫీల్డ్ హైవేతో పల్నాడు జిల్లాకు మహర్దశ

image

హైదరాబాదు నుంచి పల్నాడు జిల్లా మీదగా అమరావతిని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉండడంతో పల్నాడు జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. టీఎస్‌లోని హాలియా, అడవిదేవరపల్లి, వజీరాబాద్ నుంచి ఏపీలోని దైద, దాచేపల్లి, ముత్యాలంపాడు మీదగా హైవేను ప్రతిపాదించారు.