News October 13, 2025
ప్రారంభాలు తప్ప విక్రయాలు లేవా..?

తిరుచానూరు మామిడి కాయలు మండి వద్ద మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మూడోసారి ప్రారంభమైన రైతుబజారు సైతం మూతపడింది. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు, గత బుధవారం మూడోసారి ఈ మార్కెట్ను అధికారులు ప్రారంభించారు. అయితే రైతులు ఎవరూ రాకపోవడంతో మూతవేసి ఉంది. మార్కెట్లో సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 13, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 81 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ ఎం.హరిత తెలిపారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి 81 దరఖాస్తులను స్వీకరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 48 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News October 13, 2025
ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం వాయిదా

ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తూ.గో. జిల్లా శాఖ నూతన మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు విషయమై ఈ నెల 15న ఉదయం 11 గంటలకు జరగవలసిన సమావేశం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం తెలిపారు. ఉమ్మడి తూ.గో. జిల్లా కాకినాడ నుంచి జాబితా ఇంకా అందకపోవడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. తదుపరి సమావేశపు తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
News October 13, 2025
సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయానికి 75 పిటిషన్లు: ఎస్పీ

సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 75 పిటిషన్లు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సతీశ్ బాబు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులు బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అర్జీల పట్ల అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.