News October 13, 2025

పల్నాడు: ‘ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

image

పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ నరేంద్రనాథ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 17వ తేదీలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. 17వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కౌన్సెలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Similar News

News October 13, 2025

ఎన్‌సీడీ స్క్రీనింగ్ త్వరగా పూర్తి చేయాలి: డీఎంహెచ్‌ఓ

image

భద్రాద్రి జిల్లాలో సంక్రమణ రహిత వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ – ఎన్‌సీడీ) స్క్రీనింగ్ కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్. జయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్క్రీనింగ్ నిర్వహించి, ఆన్‌లైన్ డేటాను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని ఆమె సూచించారు.

News October 13, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 13, 2025

రేపు చరిత్ర సృష్టించబోతున్నాం: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ రేపు MOU చేసుకోబోతోందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2024 OCTలో USలోని Google ఆఫీసును సందర్శించా. ఏడాదిపాటు చర్చలు, కృషి తర్వాత రేపు చరిత్ర సృష్టించబోతున్నాం. టెక్ దిగ్గజాల్లో ఒక్కటైన గూగుల్ మన ఏపీకి వస్తోంది. ఈ 1GW ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు. ఇది గేమ్ ఛేంజింగ్ ఇన్వెస్ట్‌మెంట్. రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు, ఇన్నోవేషన్‌కు ముందడుగు’ అని పేర్కొన్నారు.