News October 13, 2025
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేయించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News October 13, 2025
రాష్ట్రస్థాయి వుషు పోటీలకి అనంతపురం విద్యార్థులు

రాష్ట్రస్థాయి అండర్-19 వుషు క్రీడల పోటీలకు అనంతపురం జిల్లా విద్యార్థులు ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీలు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు రాజమండ్రిలో పోటీలు జరుగుతాయని అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఆదివారం సాయంత్రం రాజమండ్రికి పయనమయ్యారు. ఇవాళ ఉదయం ప్రాక్టీస్ సెషన్ అనంతరం పోటీలు ప్రారంభం అవుతాయని అన్నారు.
News October 12, 2025
డాక్టర్ కావాలని ఆశను కూటమి ప్రభుత్వం చిదిమేస్తోంది: రంగయ్య

డాక్టర్ కావాలనే పేద, సామాన్య, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను కూటమి ప్రభుత్వం చిదిమేస్తోందని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దొడగట్టలో ఆదివారం వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. తలారి రంగయ్య సంతకం చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుట్రను ప్రజలకు తెలియజేయాలని కోటి సంతకాల కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు.
News October 12, 2025
గుంతకల్లులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

గుంతకల్లు మండలం కసాపురం రోడ్డులో బైక్ అదుపు తప్పి కింద పడింది. ప్రమాదంలో శివకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నప్పటికీ ఆదివారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల గ్రామానికి చెందిన శివకుమార్ పనిమీద గుంతకల్లుకు వచ్చాడు. తిరిగి నంచర్లకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కిందపడి మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.