News October 13, 2025
గొడవైందా? మరి ఆ తర్వాత..

గొడవల్లేకుండా ఏ బంధం ఉండదు. ముఖ్యంగా దంపతుల మధ్య కలహాలు సాధారణం. అయితే వీటి వల్లే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడం, ఆ బంధం స్ట్రాంగ్గా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా గొడవైన తర్వాత భాగస్వామి వెంటనే సారీ చెప్పాలని ఆశించకండి. వారికి ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. ఒకరినొకరు నిందించుకోకూడదు. అలాగే గొడవ ఎందుకు జరిగింది, ఆ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు అన్నవి కూడా చర్చించుకోవాలి.
Similar News
News October 13, 2025
WOW: ఇది ఎక్కడో కాదు.. మన దగ్గరే

ఫొటో చూడగానే ఏ అమెరికానో, యూరప్ కంట్రీనో అని అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఇది మన హైదరాబాద్ నగరంలో తీసిన ఫొటోనే. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో తీసిన ఈ పిక్ను Xలో ఓ యూజర్ పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. ఎత్తైన భవనాలు, మధ్యలో బంగారు వర్ణం మబ్బులతో కనువిందు చేస్తోంది. మీకెలా అనిపించింది? COMMENT
credits: @beforeishutup
News October 13, 2025
నకిలీ మద్యంపై CBIతో విచారణ చేయించాలి: YCP

AP: CBNకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని YCP డిమాండ్ చేసింది. నేడు రాష్ట్రంలో ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. తప్పు చేసిన వాళ్లే సిట్తో దర్యాప్తు చేయించడం హాస్యాస్పదమని విమర్శించింది. దోషులు ఎవరున్నా తక్షణమే అరెస్టు చేయాలని, కల్తీ సరకుతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలంది. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసింది.
News October 13, 2025
వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

14 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్తో క్రీడా ప్రపంచాన్ని మెప్పించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి 2 రౌండ్లకు వైస్ కెప్టెన్గా నియమించింది. ఆ జట్టు కెప్టెన్గా సకీబుల్ గని వ్యవహరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా IPLలో RR తరఫున అదరగొట్టిన వైభవ్.. ఇటీవల IND-U19 జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు.