News October 13, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 81 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ ఎం.హరిత తెలిపారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి 81 దరఖాస్తులను స్వీకరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 48 దరఖాస్తులు వచ్చాయన్నారు.
Similar News
News October 13, 2025
కేజీహెచ్లో ఫుట్ స్కానింగ్ పరీక్షలు

కేజీహెచ్లోని ఫుట్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు పరికరాన్ని సిద్ధం చేశారు. ఇప్పటివరకు హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉండే ఈ పరికరం కేజీహెచ్లోని మెడిటెక్ జోన్ సహకారంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ పరికరాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ప్రారంభించగా.. పీజీ విద్యార్థులకు, వైద్యులకు మొదటగా పరీక్షలు చేశారు. పాదాల్లో దీర్ఘకాలిక సమస్యలు, మార్పులు గమనించి చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.
News October 13, 2025
HYD: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు నంబర్ వన్!

చర్లపల్లి జైలును ఈరోజు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శమన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ అద్భుతమని, ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని సూచించారు.
News October 13, 2025
HYD: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు నంబర్ వన్!

చర్లపల్లి జైలును ఈరోజు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శమన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ అద్భుతమని, ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని సూచించారు.