News October 13, 2025
అనకాపల్లి జిల్లాలో 1.30 లక్షల గుంబూషియా చేపలు విడుదల

గుంబూషియా చేపలతో దోమలను నియంత్రించవచ్చునని డీఆర్ఓ సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గల కొలనులో గుంబూషియా చేపలను విడుదల చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన 295 నీటి నిల్వ కేంద్రాలు, చెరువులు,కొలనులు బావుల్లో 1.30 లక్షల గుంబూషియా చేపలను విడుదల చేసినట్లు తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్ లో ఈ చేపలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇవి నీటిలో లార్వాను పూర్తిగా తినేస్తాయన్నారు.
Similar News
News October 14, 2025
HYD: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై ఫిర్యాదు

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై వినియోగదారులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. సర్వీసింగ్ మోసం వస్తే ఎక్కువ జాప్యం చేస్తున్నారని, అనుమతి లేకుండా విడిభాగాలను తొలగిస్తున్నారని చెప్పారు. అలాగే కస్టమర్ల వాహనాలను సిబ్బంది వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. సంబంధిత సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 14, 2025
HYD: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై ఫిర్యాదు

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై వినియోగదారులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. సర్వీసింగ్ మోసం వస్తే ఎక్కువ జాప్యం చేస్తున్నారని, అనుమతి లేకుండా విడిభాగాలను తొలగిస్తున్నారని చెప్పారు. అలాగే కస్టమర్ల వాహనాలను సిబ్బంది వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. సంబంధిత సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 14, 2025
తిప్పలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్కు అంతరాయం

ఎర్రగుంట్ల మండలం కమలాపురం వెళ్లే రహదారిలోని తిప్పలూరు వద్ద సోమవారం రాత్రి కంటైనర్ -లారీ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోగా అతనిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో రెండు లారీలు ఢీకొనడంతో రోడ్డుకు ఇరువైపుల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.