News October 13, 2025

మంచిర్యాల: కీటక జనిత వ్యాధులపై అవగాహన

image

జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 బృందాల ద్వారా ఫైలేరియాని నిర్ధారణ కోసం రాపిడ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య అధికారి డా.అనిత చెప్పారు. మంచిర్యాల మండలం తాళ్లపేట పీహెచ్సీలో సర్వేలో పాల్గొంటున్న బృందాలతో సమీక్ష నిర్వహించారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగీ, చికెన్ గునియా, ఫైలేరియా వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. దోమలు కుట్టకుండా, వృద్ధి చెందకుండా చూడాలన్నారు.

Similar News

News October 14, 2025

SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

image

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్‌డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.

News October 14, 2025

ములుగు: పర్యవేక్షణ బాధ్యత పొంగులేటికి సీఎం అప్పగించారు: సీతక్క

image

మేడారం జాతర పనుల పర్యవేక్షణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని సీతక్క అన్నారు. సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గద్దెల విస్తరణలో భాగంగా గ్రామస్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని, మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు పూర్తి చేస్తున్నామన్నారు.

News October 14, 2025

శామీర్‌పేట్: కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా

image

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేశ్ కిషోర్ అనే అడ్వకేట్ షూ విసరడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయమూర్తులకు రక్షణ కరవైందన్నారు.