News October 13, 2025

ములుగు: కాంట్రాక్టుల కోసమే మేడారంలో మంత్రుల హడావుడి: బడే నాగజ్యోతి

image

మేడారంలో కాంట్రాక్టు పనులు, కమీషన్ల కోసమే మంత్రులు హడావుడి చేస్తున్నారని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. నేటి మంత్రుల పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి మధ్య వివాదమే దీనికి నిదర్శనమన్నారు. మేడారం విశ్వాసం, ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Similar News

News October 14, 2025

FLASH: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తనిఖీల్లో రూ.25 లక్షలు పట్టివేత

image

HYD జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) అమీర్‌పేట్ మైత్రీవనం ఎక్స్ రోడ్ వద్ద సారధి స్టూడియో సమీపంలో ఓ కారును తనిఖీ చేసింది. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. జైరాం తలాసియా అనే వ్యక్తి కారులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదును అధికారులు సీజ్ చేసి, తదుపరి చర్యల కోసం మధురానగర్ PS SHO ప్రభాకర్‌కు అప్పగించారు.

News October 14, 2025

TODAY HEADLINES

image

* మోదీతో చంద్రబాబు భేటీ.. కర్నూలు, విశాఖకు ఆహ్వానం
* సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు: సీఎం రేవంత్
* అమరావతిలో CRDA భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు
* కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ: సుప్రీంకోర్టు
* ఇజ్రాయెల్ బందీల విడుదల.. ట్రంప్‌, నెతన్యాహును ప్రశంసించిన మోదీ
* AP: సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

News October 14, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు

image

హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. లేఅవుట్లలో పార్కులు, డెడ్ ఎండ్ రోడ్ల కబ్జాలు, వరద కాలువల మలుపులు ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నారు. రావిర్యాల పెద్ద చెరువు ప్రభావంపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించామన్నారు.