News October 13, 2025

MHBD: వసతి గృహాలను తనిఖీ చేయాలి: కలెక్టర్

image

ప్రత్యేక అధికారులు అన్ని వసతి గృహాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలలో ఈరోజు, రేపు, ఎల్లుండి, మూడు రోజులు ప్రత్యేక అధికారులు తనిఖీ నిర్వహించి, పరిసరాలను పరిశీలించి, పిల్లలతో కలిసి భోజనం, వసతి గృహాలలో పరిస్థితులను గమనించాలన్నారు.

Similar News

News October 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 14, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.55 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 14, 2025

తనుశ్రీకి ఉత్తమ ప్రతిభ అవార్డు

image

అమరాపురంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని తనుశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేత ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. హుదుగుర్ గ్రామానికి చెందిన తిప్పేస్వామి, శోభ దంపతుల కుమార్తె తనుశ్రీ హైదరాబాదులో నృత్య ప్రదర్శనకు అవార్డు, ప్రశంసా పత్రం పొందినట్లు తెలిపారు. పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాలికను అభినందించారు.

News October 14, 2025

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

image

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.