News October 13, 2025
సూర్యాపేట: వృద్ధ దంపతుల ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు భూక్యా లచ్చు, వీరమ్మ ఆదివారం
రాత్రి ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మకూరు (ఎస్) మం. బోట్యా తండాలో ఈ విషాద ఘటన జరిగింది. అనారోగ్య సమస్యలే కారణమని వృద్ధ దంపతుల కుమారుడు మోహన్ తెలిపారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
Similar News
News October 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 14, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.55 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 14, 2025
తనుశ్రీకి ఉత్తమ ప్రతిభ అవార్డు

అమరాపురంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని తనుశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేత ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. హుదుగుర్ గ్రామానికి చెందిన తిప్పేస్వామి, శోభ దంపతుల కుమార్తె తనుశ్రీ హైదరాబాదులో నృత్య ప్రదర్శనకు అవార్డు, ప్రశంసా పత్రం పొందినట్లు తెలిపారు. పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాలికను అభినందించారు.
News October 14, 2025
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.