News October 14, 2025
TODAY HEADLINES

* మోదీతో చంద్రబాబు భేటీ.. కర్నూలు, విశాఖకు ఆహ్వానం
* సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్లు: సీఎం రేవంత్
* అమరావతిలో CRDA భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు
* కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ: సుప్రీంకోర్టు
* ఇజ్రాయెల్ బందీల విడుదల.. ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ
* AP: సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Similar News
News October 14, 2025
రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్లు, CII ప్రతినిధులు, ఎక్స్పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
News October 14, 2025
పెన్షనర్ల కోసం ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్’ క్యాంపైన్

పెన్షనర్ల కోసం కేంద్రం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1-30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహా పెన్షనర్లకు నగదు అందించే 19 బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. 1.8 లక్షల పోస్ట్ మ్యాన్/గ్రామీణ డాక్ సేవక్లు ప్రతి పెన్షనర్ ఇంటికి వెళ్లి DLC జెనరేట్ చేస్తారు. సాధారణంగా పెన్షన్ కోసం ఏటా పెన్షనర్లే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
News October 14, 2025
ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.