News April 8, 2024

విశాఖ: పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బిల్లు బకాయిలు

image

ఆరోగ్యశ్రీలో పేదలకు ఉచిత వైద్యం అందించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. జిల్లాలో 55 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తుండగా వాటికి సుమారు ఏడు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో సుమారు రూ.70 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో ఆస్పత్రికి కనిష్టంగా రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

Similar News

News September 10, 2025

విశాఖలో ఈ-వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం ప్రారంభం

image

విశాఖ మెడటెక్ జోన్‌లో అత్యాధునిక ఈ-వ్యర్థాల ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభమైంది. ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్ (ప్రధాన శాస్త్రీయ సలహాదారు), డా.పర్వీందర్ మైనీ (శాస్త్రీయ కార్యదర్శి), మెడటెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ, GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్, బయోమెడికల్ పరికరాల వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేసి మళ్లీ వినియోగించేలా ఈ కేంద్రం పని చేస్తుందని అధికారులు తెలిపారు.

News September 10, 2025

గాజువాక: మేడ మీద నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

image

మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం కాగా కూర్మన్నపాలెంలోని అద్దెకి ఉంటున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 10, 2025

అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ ఇవ్వద్దు: జీవీఎంసీ కమిషనర్

image

నగరంలోని జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్ ఫోర్‌లో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనగా అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు ఏసీపీ ఝాన్సీ లక్ష్మీని అడిగారు. జీవన్‌సి ఆర్థిక పరిపుష్టి సాధించే ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ పాల్గొన్నారు.