News October 14, 2025
MHBD: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: రజిత

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి రజిత అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మహబూబాబాద్లోని శ్రీనివాస నర్సరీ, మారుతీ ఆగ్రోటేక్ ఖాళీగానున్న ఫీల్డ్ అడ్వైజరీ, గ్రూప్ లీడర్స్ పోస్టుల భర్తీకి ఈనెల 15న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18-35 వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు.
Similar News
News October 14, 2025
బాలయ్యకు మంత్రి పదవి వస్తుందా?

హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. ‘అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుంది. ఓపిక పట్టండి’ అంటూ అభిమానులను సముదాయించారు. హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి జోరుగా జరుగుతోందని.. ఇంకా ఏం కావాలంటూ అభిమానులను అడిగారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ గెలుపు సాధించిన బాలయ్యకు మంత్రి పదవిపై మీ కామెంట్..
News October 14, 2025
బాలుడిపై లైంగిక దాడి.. టీచర్ సూసైడ్

విద్యార్థిపై ఉపాధ్యాయుడు<<17996239>> లైంగిక దాడికి<<>> పాల్పడిన ఘటన కొనిజర్ల మండలం అమ్మపాలెంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో ప్రభాకర్పై పోక్సో కేసు నమోదయింది. ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రభాకర్ను విధుల నుంచి తొలగించారు. విషయం బయటకు రావడంతో పరువుపోతుందని భావించిన అతను పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 14, 2025
పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి?

పూజ సమయంలో పూలు లేకపోతే చాలామంది వాటి బదులు అక్షింతలు కలిపి పూజ చేస్తుంటారు. అయితే పూలను అక్షింతలతో కలిపి పూజించవద్దని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విఘ్నాలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే.. వాటిని ముందు దేవుడి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత అక్షింతలను సమర్పించాలి. పూలు లేనప్పుడు కేవలం అక్షింతలతో పూజ చేసినా శుభ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. <<-se>>#POOJA<<>>