News October 14, 2025

పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. OCT 28 లాస్ట్ డేట్

image

TG పారామెడికల్ బోర్డు 2025- 26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిందని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RGM) ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ తెలిపారు. DMLT, డయాలసిస్ కోర్సుల్లో చెరో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు OCT 28 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://tgpmb.telangana.gov.in వైబ్సైట్‌ చూడొచ్చు.

Similar News

News October 14, 2025

పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

image

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను సాధారణ దుక్కి పద్ధతిలో నవంబర్, డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.

News October 14, 2025

విజయానికి 58 పరుగుల దూరంలో..

image

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభమైంది. భారత్ గెలవడానికి మరో 58 రన్స్ అవసరం. దీంతో తొలి సెషన్‌లోనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది. క్రీజులో రాహుల్(25), సుదర్శన్(30) ఉన్నారు. భారత్ ఈ మ్యాచులో గెలిస్తే రెండు టెస్టుల సిరీస్‌ క్లీన్‌స్వీప్ అవుతుంది.

News October 14, 2025

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

image

HYD బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలు, పట్టు చీరతో అలంకరించి, పంచ హారతులు, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.