News October 14, 2025
జనగామ: వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి

స్టేషన్ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామంలో సోమవారం వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి చెందింది. గ్రామస్తులు ఈ విషయాన్ని సంబంధిత అటవీ అధికారులకు తెలిపారు. తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ, పోలీసు శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 14, 2025
RGM: సీజనల్ వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్సులు మస్ట్

ట్రేడ్ లైసెన్స్ లేకుండా సీజనల్ వ్యాపార విక్రయాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టపాసులు, ఉన్ని దుస్తుల విక్రయాలకు కూడా ఆన్లైన్లో తాత్కాలిక ట్రేడ్ లైసెన్సు పొందాలన్నారు. వెబ్ సైట్ https://emunicipal.telangana.gov.in ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.
News October 14, 2025
ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం: సివిల్ సప్లై అధికారి

ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం చేసినట్లు జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఫైజల్ హుస్సేని తెలిపారు. జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మొత్తం 176 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా, ధాన్యం కొనుగోలుకు కావల్సిన 46 లక్షల గన్నీ బ్యాగులకు గానూ, 30.39 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని అన్నారు.
News October 14, 2025
GDK: ఈనెల 15 వరకు డిగ్రీలో ప్రవేశాలు

డా.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీలోని వివిధ కోర్సులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 15 వరకు అవకాశం ఉందని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా, కో-ఆర్డినేటర్ డా.సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. వివరాలకు 7382929655ను సంప్రదించాలన్నారు.