News October 14, 2025
HYD: సీజనల్ వ్యాధుల నియంత్రణపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర రాజనరసింహ HYDలోని సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈఏడాది డెంగీ 2,900, మలేరియా 209, టైఫాయిడ్ 4,600, చికున్గున్యా249 కేసులు నమోదవగా గతంతో పోల్చితే గణనీయంగా తగ్గాయని మంత్రికి వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
Similar News
News October 14, 2025
మంత్రి సీతక్క చొరవ.. జంపన్న వాగు వద్ద మళ్లీ బోటు

ఏటూరునాగారం మండలం దొడ్ల జంపన్న వాగు వద్ద రవాణా సౌకర్యం పునరుద్ధరించారు. నిన్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో, మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి వెళ్లగా ఆమె తక్షణమే స్పందించి, తాత్కాలికంగా తొలగించిన బోటును మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈరోజు బోటు ఏర్పాటు కావడంతో రవాణా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
News October 14, 2025
బాపట్ల: హత్యకు కుటుంబ వివాదాలే కారణమా..?

తెనాలి చెంచుపేటలో బాపట్ల జిల్లా వాసి జూటూరి తిరుపతిరావు (బుజ్జి) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అమృతలూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన తిరుపతిరావు పెదపూడి సొసైటీ మెంబర్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఐదుగురు కుమార్తెలు కాగా తెనాలిలోని ఓ కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఉదయం టిఫిన్ కోసం బయటికి వచ్చిన అతడిని ఓ వ్యక్తి నరికి చంపాడు. హత్యకు కుటుంబ వివాదాలే కారణమని సమాచారం.
News October 14, 2025
GDK: రేపు ఉదయం స్పెషల్ యాత్రా బస్సు

రేపు ఉదయం 5 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి స్పెషల్ యాత్రా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరనుంది. ఈ యాత్రలో భాగంగా రామప్ప, లక్నవరం, బొగత వాటర్ ఫాల్స్, మేడారం దర్శనాల అనంతరం రాత్రి వరకు బస్సు గోదావరిఖనికి చేరుకుంటుందని GDK DM నాగభూషణం తెలిపారు. ఒక్కరికి ఛార్జీ రూ.900లుగా ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని సూచించారు.