News October 14, 2025
BREAKING: HYD: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన ఈరోజు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో తల్లి ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్-1లో నివసిస్తున్న సాయిలక్ష్మి(27) తన రెండేళ్ల వయసు గల కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 14, 2025
అమ్మో కోఠి ENT.. ఇకనైనా మారుతుందా..?

దశాబ్దాల చరిత్ర కలిగిన HYD కోఠి ప్రభుత్వ ENT ఆస్పత్రి ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బందికి నరకంగా మారింది. ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి సమీప మురుగు నీరు రావడంతో ప్రాణాలను నిలబెట్టాల్సిన చోటే అపరిశుభ్రత, తీవ్ర దుర్వాసన రాజ్యమేలుతోంది. దీంతో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్(TGMSIDC) నూతన సమీకృత భవన నిర్మాణానికి రూ. 24.38 కోట్ల టెండర్ను ఆహ్వానించగా 18 నెలల్లో ఆసుపత్రిని ఆధునికీకరించనుంది.
News October 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సినీ ప్రముఖులతో రహస్య చర్చలు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, BRS, BJPకి పెద్ద సవాలు. ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు రాజకీయ నాయకులు కొందరు సినీ నటులతో రహస్య సమావేశాలు నిర్వహించి, తమకు మద్దతుగా ప్రచారం చేయమని ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, జూ.NTR,రామ్ చరణ్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఇక్కడి ఓటర్లు. ప్రచారం చివరి వారంలో కొందరు సెలబ్రెటీలు ప్రచారంలో పాల్గొంటారు.
News October 14, 2025
HYD: చనిపోయిన మహిళ వివరాలు గుర్తింపు

HYD మీర్పేట్ చందన (మంత్రాల) చెరువులో <<18001273>>మహిళ మృతదేహాన్ని<<>> బడంగ్పేట్ మమతానగర్ కాలనీకి చెందిన యాదమ్మ అలియాస్ కమల (50)గా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం ఆమె మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైడ్రా బృందం సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు మీర్పేట్ పోలీసులు తెలిపారు.