News October 14, 2025
వేములవాడ: భీమేశ్వరాలయంలో దర్శనాలు రద్దు..!

వేములవాడ శ్రీ రాజరజేశ్వర స్వామివారి దర్శనాల్లో అధికారులు మార్పులు చేశారు. శనివారం నుంచి భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన దర్శనాలు, మొక్కుల చెల్లింపు వసతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజన్న ఆలయ పరిసరాల్లోనే దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కాగా, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం <<17998071>>LED స్క్రీన్ల ద్వారా రాజన్న దర్శనం<<>> కల్పిస్తోంది. అవసరమైతే LCDల ద్వారా దర్శనాలు చేయిస్తామంది.
Similar News
News October 14, 2025
HYD: ‘ప్రపంచ స్కిల్ కాంపిటేషన్.. రేపే లాస్ట్’

ప్రపంచ స్కిల్ కాంపిటేషన్ (World Skill Competition)లో పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈనెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. వయస్సు 16-24 ఏళ్లలోపు ఉండి నైపుణ్యం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News October 14, 2025
నాకు 20 ఏళ్లు వచ్చేవరకు వ్యవసాయం చేశా: కలెక్టర్

తనకు 20 ఏళ్లు వచ్చేవరకు వ్యవసాయం చేసినట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. సిద్దిపేట జిల్లా తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహరం అందరికి అవసరం వ్యవసాయ పరిశోధనల ప్రపంచ జనాభాకు సరిపడా ఆహరం అందిస్తున్నయాన్నారు. ఈ మేరకు కృషి చేస్తున్న విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
News October 14, 2025
RSS సమావేశాలపై బ్యాన్కు కర్ణాటక CM ఆదేశం

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.