News October 14, 2025

BREAKING: HYD: మీర్‌పేట్ మంత్రాల చెరువులో మహిళ మృతదేహం కలకలం

image

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు ఈరోజు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News

News October 14, 2025

MDK: గురుకులాల నిధులపై రేవంత్ మాటలు నీటి మూటలేనా? హరీష్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానెల్ ద్వారా గురుకులాలకు నిధులు విడుదల చేస్తామన్న మాటలు నీటి మూటలేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని 1,024 గురుకులాలకు కేవలం రూ.60 కోట్లు కేటాయించడం సిగ్గుచేటని అన్నారు. పెండింగ్ బిల్లులు, అద్దె బకాయిలు, సిబ్బంది వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. గురుకులాల సమస్యల పరిష్కారానికి తక్షణ నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

News October 14, 2025

ALERT: రేపు భారీ వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరులోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 14, 2025

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు: మంత్రి

image

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కర్నూలులో సమీక్ష, పర్యవేక్షణ చేపట్టారు. కర్నూలు సభకు 3,070, శ్రీశైలానికి 150, భద్రతా సిబ్బందికి 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్‌నెస్ బస్సులనే వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.