News October 14, 2025

దేశంలోనే తొలి డ్రోన్‌ హబ్‌ ఓర్వకల్లులోనే..

image

దేశంలోనే తొలి <<18000986>>డ్రోన్ <<>>హన్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు కానుంది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. డ్రోన్ల వినియోగానికి విస్తృత అవకాశాలున్న మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా రంగాలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. డ్రోన్ల రంగంలో మన దేశ వాటా కేవలం 3 శాతం కాగా దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.

Similar News

News October 14, 2025

కాకినాడ సెజ్ భూములు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

image

AP: కాకినాడ సెజ్‌లోని 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల వద్ద రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని పేర్కొంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.

News October 14, 2025

జగిత్యాల జిల్లాకు వర్ష సూచన

image

జగిత్యాల జిల్లాలో రానున్న 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా జిల్లాలో ఈరోజు ఉదయమే అక్కడక్కడ చిరుజల్లు కురిసాయి.

News October 14, 2025

ఈ నెల 17న కాకినాడలో జాబ్ మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న 656 ఉద్యోగాలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. గోపాల్ ఆటోమేటివ్‌, డెక్కన్ ఫైనాన్స్‌, అపోలో ఫార్మసీ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న, టెన్త్‌ నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.