News October 14, 2025

తిరుమల: సీఐడీ విచారణ మొదలు

image

AP: HC ఆదేశాలతో తిరుమల ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణను CID ప్రారంభించింది. పరకామణి, ఆపై చోరీ కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్ PSలో రికార్డులను చెక్ చేసింది. CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. 2023 MARలో 920డాలర్లు దొంగిలిస్తూ TTD ఉద్యోగి రవి పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై TTD పూర్తిస్థాయి దర్యాప్తు చేయలేదని పిల్ దాఖలు కాగా హైకోర్టు విచారణకు ఆదేశించింది.

Similar News

News October 14, 2025

ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే?

image

TG: ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే అవకాశముంది. 2026 FEB 25 నుంచి పరీక్షలు నిర్వహించేలా టైం టేబుల్‌ ఫైల్‌ను ఇంటర్ బోర్డు CMకు పంపినట్లు తెలుస్తోంది. దీనికి రేవంత్ సైతం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు Way2Newsకు వెల్లడించాయి. ఎంట్రన్స్ పరీక్షలు(JEE మెయిన్, ఎప్‌సెట్) ఉండటంతో షెడ్యూల్ ముందుకు జరిపినట్లు సమాచారం. అటు ఏపీలో FEB 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News October 14, 2025

వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకోండి

image

మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం వైట్ డిశ్చార్జ్. అయితే ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుందంటున్నారు నిపుణులు. దుర్వాసన, రంగుమారడం, మంట అసౌకర్యం వంటి లక్షణాలకు ఇన్ఫెక్షన్లు, లైంగిక వ్యాధులు కారణం కావొచ్చంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ మూసుకుపోయి గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. <<-se>>#Womenhealth<<>>

News October 14, 2025

బనకచర్లను ఆపండి… CWCకి తెలంగాణ లేఖ

image

ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం CWC, పోలవరం అథారిటీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం DPRకు విరుద్ధంగా ఉందని లేఖలో వెల్లడించింది.