News October 14, 2025
శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ

ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పరిశీలించారు. హెలిప్యాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News October 14, 2025
గిరిజన ఉత్పత్తులకు అధిక లాభాలు రావాలి: కలెక్టర్

జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ స్థాపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులను మరింత పెంచాలన్నారు. వాటి నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకింగ్, మార్కెట్ సౌకర్యం కల్పించి అధిక లాభాలు వచ్చేలా చేయాలన్నారు.
News October 14, 2025
పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్టర్మ్లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
News October 14, 2025
బద్దిపడగ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎమ్ సస్పెండ్

సి్ద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM పద్మను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్వీస్ నుంచి సస్పెండ్ చేశామని DEO తెలిపారు. జిల్లా కలెక్టర్ పాఠశాల సందర్శనలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడం, అమలు చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.