News October 14, 2025
PDPL: లొంగిపోయిన మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్..!

PDPL పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, సోను మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. MHలోని గడిచిరోలిలో 60మందితో కలిసి సరెండరయ్యారు. ఇక మల్లోజులపై రూ.కోటి రివార్డుంది. అయితే తాను లొంగిపోయేది లేదని గతంలో తల్లి మధురమ్మకు వేణుగోపాల్ లేఖ రాశారు. కాగా వేణుగోపాల్ సోదరుడు, కేంద్ర కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు బెంగాల్లో గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు.
Similar News
News October 14, 2025
సిరిసిల్ల: ‘వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలి’

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా లావాదేవీలు జరగని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. ఈ మేరకు సిరిసిల్లలో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కేవైసీ చేయించుకుని మళ్ళీ వారి అకౌంటుని ఆక్టివేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. 10 సంవత్సరాలకు పైగా క్లైమ్ చేయని డిపాజిట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ కి బదిలీ చేయబడ్డాయన్నారు.
News October 14, 2025
మర్కూక్: మాగంటి సునితకు బీఫాం అందజేసిన కేసీఅర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్కు ఇచ్చారు. దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తదితరులు హాజరయ్యారు.
News October 14, 2025
గిరిజన ఉత్పత్తులకు అధిక లాభాలు రావాలి: కలెక్టర్

జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ స్థాపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులను మరింత పెంచాలన్నారు. వాటి నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకింగ్, మార్కెట్ సౌకర్యం కల్పించి అధిక లాభాలు వచ్చేలా చేయాలన్నారు.


