News October 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సినీ ప్రముఖులతో రహస్య చర్చలు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, BRS, BJPకి పెద్ద సవాలు. ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు రాజకీయ నాయకులు కొందరు సినీ నటులతో రహస్య సమావేశాలు నిర్వహించి, తమకు మద్దతుగా ప్రచారం చేయమని ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, జూ.NTR,రామ్ చరణ్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఇక్కడి ఓటర్లు. ప్రచారం చివరి వారంలో కొందరు సెలబ్రెటీలు ప్రచారంలో పాల్గొంటారు.
Similar News
News October 14, 2025
తెనాలి హత్య కేసులో నిందితుడి గుర్తింపు.. ప్రత్యేక బృందాలతో గాలింపు

తెనాలి చెంచుపేటలో ఉదయం జరిగిన తిరుపతిరావు హత్య కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే బాధ్యతలు తీసుకున్న త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఉదయాన్నే హత్య జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీస్ డాగ్ సింబా స్పాట్ నుండి పక్క వీధి మీదగా డొంకరోడ్డు ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది.
News October 14, 2025
VZM: ‘జిల్లా వ్యాప్తంగా 557 కేసులు’

శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి బి.మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 557 కేసులు నమోదు చేసి, రూ.34.12 లక్షల జరిమానా, రూ.24.12 లక్షల రాజీ రుసుం వసూలు చేసినట్లు చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
News October 14, 2025
సంగారెడ్డి: కారు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షలు చోరీ

కారు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షలు చోరీ చేసిన ఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ముజాఫర్ ఇల్లు అమ్మి డబ్బుతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. ఓ దాబా వద్ద కారు ఆపగా బైక్పై వచ్చిన ఇద్దరు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షల ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.