News October 14, 2025

TU: అదుపు తప్పిన ఉపకులపతి కారు

image

టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు ప్రభుత్వ వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం ఉపకులపతి పరిపాలనా భవనం వద్దకు చేరుకొని, తన సొంత పనుల నిమిత్తం వాహనంలో ఆయన భార్యను నిజామాబాద్‌కి పంపించారు. తిరిగి వస్తుండగా కంఠేశ్వర్ బైపాస్ వద్ద అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గమనించిన స్థానికులు వాహనాన్ని రోడ్డుకు చేర్చారు.

Similar News

News October 14, 2025

సిద్దిపేట: స్వగ్రామానికి చేరిన మావోయిస్టు వెంకటయ్య

image

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు కొంకకటి వెంకటయ్య అలియాస్ వికాస్ కొన్ని రోజుల క్రితం DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఆయన మంగళవారం స్వగ్రామమైన కూటిగల్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆయన పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.

News October 14, 2025

GWL: తెలంగాణ రైజింగ్ విజన్‌లో ఉద్యోగులు పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణని అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్- 2047’ డాక్యుమెంట్ రూపకల్పనలో ఉద్యోగులు పాల్గొనాలని గద్వాల కలెక్టర్ సంతోష్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు ఈ సర్వే అక్టోబర్ 10న ప్రారంభమైందని తెలిపారు. ఉద్యోగులు, పౌరులు పాల్గొని విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News October 14, 2025

ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

image

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>