News April 8, 2024

ముగిసిన మూల్యాంకణం: డీఈఓ

image

అనంతపురం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1.81 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. డీఈఓ వరలక్ష్మి పర్యవేక్షణలో 1వ తేదీ నుంచి అన్ని వసతులు కల్పించారు. డీఈఓ మాట్లాడుతూ.. అందరి సమష్ఠి కృషితోనే జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు, మూల్యాంకన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News January 12, 2026

‘ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించండి’

image

ఈ నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, పలు సూచనలు జారీ చేశారు. జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News January 12, 2026

అనంతపురం జిల్లా JC బదిలీ

image

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News January 12, 2026

అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

image

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.