News October 14, 2025
జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీపై ఒవైసీ కీలక ప్రకటన

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు MIM అభ్యర్థిపై ఒకటి, రెండురోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పదేళ్ల BRS పాలనలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి లేదన్న ఆయన.. BRS నుంచి ఇక్కడ మంత్రి ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారన్నారు. బీజేపీకి పాజిటివ్గా ఉండటానికి తాను అభ్యర్థిని నిలబెడతాననే విమర్శలు వస్తాయన్న ఆయన.. కాంగ్రెస్కు తాము ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.
Similar News
News October 15, 2025
ఓయూ: ఎంఈ, ఎం.టెక్ పరీక్షా తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎం.టెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎం.టెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
News October 15, 2025
పిల్లల రక్షణ, విద్యకు పక్కా ప్రణాళిక: కలెక్టర్ హరిచందన

పిల్లల రక్షణ, నాణ్యమైన విద్యాబోధన కోసం క్యాలెండర్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని అనుబంధ శాఖల అధికారులను HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ‘క్లాప్'(సిటీ లెవల్ యాక్షన్ ప్లాన్) అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పిల్లల రక్షణ, నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన ఆహారం అందించుటలో ఈ ప్రణాళికలు కీలకం కావాలని ఆమె సూచించారు.
News October 15, 2025
HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్.. 80 వేల కేసుల నమోదు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకుండా సీపీ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. జనవరి 1 నుంచి అక్టోబర్ 12 వరకు 80,555 కేసులు నమోదు కాగా, అక్టోబర్ 13 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మరో 2,345 కేసులు నమోదైనట్లు తెలిపారు. No Call Is More Important Than a Life అంటూ ప్రచారం చేస్తున్నారు.