News April 8, 2024

VZM: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం

image

పరవాడ జెఎన్ ఫార్మాసిటీలోని రెండు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయని CITU నేత గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. గంట్యాడ మండలం సిరిపురానికి చెందిన ఆళ్ల గోవింద కుటుంబానికి రూ.32.50 లక్షలు, పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన రమణ కుటుంబానికి రూ.35 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.

Similar News

News January 21, 2026

VZM: రబీ లక్ష్యం దాటిన ఉద్యాన మిషన్

image

జిల్లాలో రబీ సీజన్‌లో ఉద్యాన సాగు లక్ష్యాన్ని మించి పెరిగిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లక్ష్యంగా పెట్టుకున్న 4,000 ఎకరాలకు బదులుగా 4,800 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఖరీఫ్‌లో మరో 6,000 ఎకరాల్లో ఉద్యాన సాగుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

News January 21, 2026

చీపురుపల్లి, రాజాంలో రెండు MSME పార్కులు

image

చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో కొత్తగా రెండు MSME పార్కుల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించి భూసేకరణ ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే విస్తరణ, ఫుడ్ పార్కులు, పరిశ్రమల విస్తరణపై సమీక్షించారు.

News January 21, 2026

చీపురుపల్లి, రాజాంలో రెండు MSME పార్కులు

image

చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో కొత్తగా రెండు MSME పార్కుల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించి భూసేకరణ ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే విస్తరణ, ఫుడ్ పార్కులు, పరిశ్రమల విస్తరణపై సమీక్షించారు.