News October 14, 2025
పెద్దపల్లి: ‘ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలి’

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలెక్టరేట్లో మంగళవారం ఉపాధ్యాయుల శిక్షణలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో థింక్- పేర్-షేర్ విధానం అమలు ద్వారా మౌనంగా, ఇన్యాక్టివ్గా ఉన్న విద్యార్థుల్ని బోధనలో భాగస్వామ్యం చేసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విధానంపై ఉపాధ్యాయులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, సందేహాలు శిక్షణలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నేతలు

సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నియోజకవర్గ నేతలు కూడా ఉన్నారు. మంగళవారం నారాయణఖేడ్లో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కోసం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పేర్లకు పలువురు మద్దతు పలికారు.
News October 15, 2025
కామారెడ్డి: తల్లి ఆత్మహత్యకు కారణమైన కొడుకు అరెస్ట్

తల్లి మృతికి కారణమైన కసాయి కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు SI స్రవంతి తెలిపారు. పోలీసుల వివరాలు.. దోమకొండకు చెందిన చింతల సాయిలు తన తల్లి లక్ష్మవ్వ(70)కు సరిగా తిండి పెట్టకుండా వేధింస్తూ, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మవ్వ మృతికి ఆమె కొడుకే కారణమని నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News October 15, 2025
HYD: సనత్నగర్లో గన్, తల్వార్ సీజ్

హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్లో గన్తో హల్చల్ చేస్తున్న చంద్రకాంత్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ గన్, తల్వార్తో కొంతకాలంగా కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అతడి నుంచి గన్, తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.