News October 14, 2025

రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా.. బుధవారం ఆమె పెద్దకర్మను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అవుతున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, PGR గార్డెన్స్‌ను సీపీ పరిశీలించి సూచనలు చేశారు.

Similar News

News October 15, 2025

అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

image

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>

News October 15, 2025

పత్తి నాణ్యత బాగుండాలంటే.. ఇలా చేయండి

image

తెలుగు రాష్ట్రాల్లో పత్తి తీతలో రైతులు నిమగ్నమయ్యారు. పత్తి నాణ్యత బాగుంటేనే అధిక ధర వస్తుంది. పంటకు మంచి ధర దక్కాలంటే పత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడి, అందులో తేమశాతం తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. లేకుంటే గింజలు ముడుచుకుపోయి పత్తి తూకం తగ్గి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. పత్తిని నిల్వచేసే సంచులను శుభ్రంగా ఉంచాలి. వాటిలో దుమ్ము, ధూళీ లేకుండా చూస్తే పత్తి రంగు మారదు.

News October 15, 2025

నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం

image

అతి పెద్ద దేశవాళీ క్రికెట్ సమరం ‘రంజీ ట్రోఫీ 2025-26’ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ 91వ ఎడిషన్‌లో 38 జట్లు తలపడుతున్నాయి. విదర్భ డిఫెండింగ్ ఛాంపియన్‌గా, కేరళ జట్టు రన్నరప్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచులు జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఖేల్ టీవీలో లైవ్ చూడొచ్చు. ఈ సీజన్‌లో మొత్తం 138 మ్యాచులు జరగనున్నాయి. అత్యధికంగా ముంబై జట్టు 42సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచింది.