News October 14, 2025
నిర్మల్: జిన్నింగ్ మిల్లుల్లో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరి

మంగళవారం సాయంత్రం అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మిల్లులలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు సహా అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వే బ్రిడ్జీలకు నిర్ణీత గడువులోపు స్టాంపింగ్ చేయించుకోవాలని సూచించారు. రైతులు పంటలు అమ్మిన వెంటనే నిర్ణీత గడువులోపు వారికి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 15, 2025
శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ రాజ్యం

శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం చూడాల్సిన చారిత్రక ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ రాజసాన్ని ప్రతిబింబించేలా భారీ బురుజులు, మధ్యలో కోట.. అందులో భారీ విగ్రహం వంటివి ఎన్నో ఉన్నాయి. శివాజీ 1677లో శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని సందర్శించి, ఆలయానికి ఉత్తరం వైపున ధ్యానం చేయడంతో ఆ ప్రదేశంలోనే ధ్యాన మందిరం నిర్మించారు. ఈ స్ఫూర్తి మందిరాన్ని ఈనెల 16న ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
News October 15, 2025
అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>
News October 15, 2025
పత్తి నాణ్యత బాగుండాలంటే.. ఇలా చేయండి

తెలుగు రాష్ట్రాల్లో పత్తి తీతలో రైతులు నిమగ్నమయ్యారు. పత్తి నాణ్యత బాగుంటేనే అధిక ధర వస్తుంది. పంటకు మంచి ధర దక్కాలంటే పత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడి, అందులో తేమశాతం తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. లేకుంటే గింజలు ముడుచుకుపోయి పత్తి తూకం తగ్గి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. పత్తిని నిల్వచేసే సంచులను శుభ్రంగా ఉంచాలి. వాటిలో దుమ్ము, ధూళీ లేకుండా చూస్తే పత్తి రంగు మారదు.